తెల్లవారుజామున ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ- ఏడుగురికి గాయాలు శంకరపట్నం డిసెంబర్ 11
Published: Monday December 12, 2022
శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామ శివారులో ప్రధాన జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొనగా హుజురాబాద్ కి చెందిన సర్దాన పోశెట్టి, ఆకుల రాజు ఇరువురికి తీవ్ర గాయాలు అవ్వగా మిగతా ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.
Share this on your social network: