సంఘం అభివృద్ధి చెందాలంటే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

Published: Friday December 16, 2022
జన్నారం, డిసెంబర్ 15, ప్రజాపాలన: మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుతోనే ఆ సంఘం అభివృద్ధి చెందుతుందని గురువారం మున్నూరు కాపు రాష్ట్ర కార్యదర్శి కాశేట్టి లక్ష్మణ్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల కేంద్రంలోని కాపు సంఘం భవనంలో ఆ సంఘం సమావేశం నిర్వహించారు. మండలంలోని ప్రతి గ్రామంలోని మున్నూరు కాపు సంఘం బలోపేతం చేస్తున్నామన్నారు. కాపుల అభివృద్ధికి సంఘ సభ్యులంతా, మున్నూరు కాపు నాయకులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ ఇట్యాల కిషన్, వైస్ ఎంపీపీ సుతారి వినయ్ కుమార్, లెక్కల మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.