రక్తదానం చెయ్యండి - ప్రాణ దాతలు కండి: ఆర్టీసీ మేనేజర్
Published: Monday November 29, 2021
మధిర నవంబర్ 28 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సజ్జనార్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరియు జిల్లా రెడ్ క్రాస్ సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 30వ తేదీన మధిర డిపో పరిధిలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు మధిర డిపో మేనేజర్ శ్రీ యస్.దేవదానం ఒక ప్రకటనలో తెలిపారు. మధిరఆర్టీసీడిపో నందు ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరంలో ప్రజలు స్వచ్ఛంద రక్తదాతలు, ఆర్టీసీ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదాన శిబిరాలను జయప్రదం చేయాలని కోరారు.
Share this on your social network: