ఎంపిని మర్యాదపూర్వకంగా కలిసిన మర్పల్లి మండల బిఆర్ఎస్ నాయకులు

Published: Monday January 09, 2023
వికారాబాద్ బ్యూరో 8 జనవరి ప్రజా పాలన : చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశామని మర్పల్లి మండల బిఆర్ఎస్ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మర్పల్లి మండల బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తల సమ్మేళనానికి రావాలని ఆహ్వానించారు. మండల అభివృద్ధికి సహకరించాలని కోరారు. చెవెళ్ల పార్లమెంటు పరిధిలో మర్పల్లి మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచాలని ఆకాంక్షించారు. చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి స్పందిస్తూ మండల అభివృద్ధికి సహకరిస్తానని సానుకూలత వ్యక్తం చేశారు. ఎంపీని కలిసిన వారిలో మర్పల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నాదిరీగ శ్రీకాంత్ రెడ్డి, జెడ్పిటిసి పబ్బే మధుకర్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు పి శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కే మల్లేశం, మండల టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు పట్లూరు దేవరదేశి అశోక్, మండల ప్రధాన కార్యదర్శి కోటమర్పల్లి రాచయ్య, పార్టీ ఉపాధ్యక్షులు రమేష్ మిత్ర, డైరెక్టర్ యాదయ్య పాల్గొన్నారు.