కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎంపీపీ

Published: Wednesday June 02, 2021

బెల్లంపల్లి, జూన్ 1, ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి మండలానికి చెందిన 54 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించినట్లు ఎంపీపీ గోమాస శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం నాడు చెక్కుల పంపిణీ అనంతరం మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి చెక్కులు కొంతమందికి మాత్రమే వచ్చాయని మరికొంతమందికి రావాల్సి ఉన్నాయని ప్రతి ఒక్కరికి సిఫారసు చేసి పంపించామని ఆవి రాగానే అందరికీ అందజేస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజేందర్ మండల ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.