ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ప్రశాంతంగా ముగిసిన విద్యాసంస్థల బంద్ మధిర

Published: Wednesday August 24, 2022
 ఆగస్టు 23 ప్రజా పాలన ప్రతినిధి నియోజకవర్గ పరిధిలో మంగళవారం నాడు ఎమ్మార్పీఎస్ వారి ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం అయిందనిమందకృష్ణ మాదిగ  ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా జరిగిన కేజీ టు పీజీ విద్యా సంస్థల బంద్ మధిర నియోజకవర్గంలో దిగ్విజయంగా జరిగింది రాజస్థాన్ రాష్ట్రంలో కుల వివక్షతకు గురై ఉపాధ్యాయుని చేతిలో దెబ్బలు తిని మరణించినటువంటి ఇంద్ర కుమార్ మేఘాలు మృతికి సంతాపంగా మంద కృష్ణ మాదిగ గారి పిలుపుమేరకు మధిర నియోజకవర్గంలో బంద్ ప్రశాంతంగా జరిగింది ఎమ్మార్పీఎస్  బంద్ కు సహకరించిన ప్రభుత్వ మరియు ప్రైవేటు యజమాన్యానికి  బంద్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ఉద్యమ నమస్కారాలు ఎం ఎస్ పి మధిర నియోజకవర్గ ఇన్చార్జ్  కూరపాటి ప్రభాకర్ ఈ కార్యక్రమంలోని జిల్లా నాయకులు సీనియర్ కనకపుడి శ్రీను మాదిగ రాయవరపు దేవదాస్ మాదిగ విద్యార్థి నాయకుడు వేల్పుల పవన్ కళ్యాణ్ మాదిగ ఆశీర్వాదం మాదిగ ఏనుక మాదిగ పల్లె పోగు స్వామి మాదిగ తదితరులు పాల్గొన్నారు