*రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడలకు ఎంపికైన మడుపల్లి పాఠశాల విద్యార్థులు మధిర డిసెంబర్ 14 ప్రజాపా

Published: Thursday December 15, 2022

ఖమ్మం పట్టణంలోని సర్దార్ పటేల్ స్టేడియం మంగళవారం నాడు జరిగిన జిల్లా స్థాయి కబడ్డీ టీమ్ సెలక్షన్స్ నందు మధిర మండలంలోని మడుపల్లి గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు పి.గోపి,సిహెచ్.నందిని రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపిక కావడం జరిగింది.వీరు డిసెంబర్ 16 నుండి మంచిర్యాలలో జరుగనున్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ కబడ్డీ క్రీడల్లో పాల్గొంటారని వీరిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. పద్మావతి,పిఈటి బొందిలి చైతన్య తెలిపారు.ఈ సందర్భంగా బుధవారం నాడు పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అభినందన కార్యక్రమంలో మధిర మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శీలం విద్యాలత,వార్డ్ కౌన్సిలర్లు తోగరు వరలక్ష్మి,మేడికొండ కళ్యాణి,పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ రాజేశ్వరి, అప్పారావు, కో.ఆప్షన్ సభ్యులు శ్రీనివాసరావు (బుజ్జి) పాల్గొని అభినందించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగూర్ వలీ,వెంకటేశ్వరరావు,నరసింహారావు, కోటేశ్వరరావు,బాబురావు,కిషోర్,యహోషువ, కృష్ణయ్య,రామిరెడ్డి,జ్యోతిర్మయి,రాణి, చిట్టిబాబు,సిబ్బంది గౌసుద్దీన్,సూర్య ప్రకాష్ రావు,లూర్ధు తదితరులు పాల్గొన్నారు.