సీతారాం పేట్ వ్యాక్సినేషన్

Published: Tuesday October 12, 2021

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 11, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని సీతారాం పేట్ గ్రామం ప్రజలను దృష్టిలో ఉంచుకొని కోవిడ్ మహమ్మారిని తరిమికొట్టడానికి సింగిల్విండో చైర్మన్ టేకుల సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో  వ్యాక్సిన్ కార్యక్రమము సోమవారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలందరూ వచ్చి మనస్ఫూర్తిగా వ్యాక్సిన్ వేసుకోవడం జరిగిందని ఏడవ వార్డు కౌన్సిలర్ కొండ్రు శ్రీలత రాంబాబు తెలిపారు. గ్రామంలో టీకాలు వేయించు కొని వారెవరైనా ఉన్నట్లయితే త్వరగా సద్వినియోగం చేసుకోవాలని వార్డు కౌన్సిలర్ శ్రీ లత రాంబాబు తెలిపారు.