డిసెంబర్ 3న మెగా సదరం క్యాంపుల ఏర్పాటు ** ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వరుణ్ రెడ్డి **

Published: Saturday November 26, 2022

ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 25 (ప్రజాపాలన, ప్రతినిధి) : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 3న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి, ఉట్నూర్ (సిహెచ్ సి) ఆస్పత్రులలో మెగా సదరం క్యాంపులను నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన దివ్యాంగులు సమీప మీసేవ కేంద్రాలలో ఈనెల 28 నుండి డిసెంబర్ 3 వరకు ప్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. సదరం క్యాంపులకు హాజరయ్యే అభ్యర్థులు దివ్యాంగ అర్హత పత్రాలతో పాటు ప్లాట్ బుకింగ్ పత్రాలను తమ వెంట తీసుకుని రావాలని తెలిపారు. నిరుపేద గిరిజనులకు ఆసరా పెన్షన్లు మంజూరు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు సదరం సర్టిఫికెట్ తప్పనిసరి అయినందున ఐటీడీఏ ద్వారా నిర్వహించే మెగా సదరం క్యాంపులను ఉమ్మడి జిల్లాలోని అర్హులైన గిరిజన దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీవో తెలిపారు.