దారుల్ అన్సార్ సొసైటీ సేవలు అభినందనీయం..

Published: Friday April 29, 2022
కరీంనగర్, ఏప్రిల్ 28 ప్రదాపాలన : రంజాన్ పండుగ సందర్భంగా దారుల్ అన్సార్ సొసైటీ సేవలు అభినందనీయమని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. గురువారం షబే ఖదర్ సందర్భంగా కశ్మీర్ గడ్డలోని శాలిమార్ ఫంక్షన్ హల్లో 200 మంది పేదలకు 300 రూపాయల నగదు, సెమియాలు ఈద్ సామగ్రిని పంపిణీ కార్యక్రమాన్ని దారుల్ అన్సార్ సొసైటీ నిర్వాహకుడు హాఫిజ్ సయ్యద్ రిజ్వాన్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కోమటిరెడ్డి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో దారుల్ అన్సార్ సొసైటీ పేద ముస్లింలకు సాయం అందించడం, పండుగ సందర్భంగా పేదల ఇండ్లలో సంతోషాలు నింపడం హర్షణీయమన్నారు. పేదలను ఆదుకునేందుకు దారుల్ అన్సార్ సొసైటీ వంటి సంస్థలు ముందుండాలని కోరారు. ప్రతి సంవత్సరం ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుండి చేపడుతున్న హాఫిజ్ రిజ్వాన్ ను కోమటిరెడ్డి అభినందించారు. రంజాన్ పండుగను నగర ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకోవాలని, ప్రతి ఒక్కరి జీవితంలో పండుగ నూతన కాంతులు వెదజల్లాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దారుల్ అన్సార్ సొసైటీ నిర్వాహకులు కోమటిరెడ్డి ని శాలువతో ఆత్మీయంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శహింషా, నదీమ్, హాఫిజ్ లుక్మాన్, వసీం తదితరులు ఉన్నారు.