బెల్లంపల్లి మండలం ఆర్ఎంపి సంఘం అధ్యక్షులుగా దశరథం ఎన్నిక

Published: Monday October 17, 2022
బెల్లంపల్లి అక్టోబర్ 16 ప్రజా పాలన ప్రతినిధి: బెల్లంపల్లి మండల( ఆర్ఎంపి) రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్ అసోసియేషన్ అధ్యక్షులుగా దశరథం ను ఎన్నుకున్నట్టు ఆ సంఘం నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా ఆదివారం నాడు నూతనంగా ఎన్నికైన అధ్యక్షున్ని ఘనంగా సన్మానించారు, అనంతరం సంఘం కార్యాలయాన్ని జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు తొంగల సత్యనారాయణ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్, ఆర్ఎంపీల సంఘం జిల్లా మాజీ కార్యదర్శి బత్తుల రవి, సీనియర్ డాక్టర్లు లక్ష్మణాచారి, రాజేష్, బ్రహ్మానందం, రమణాచారి, తదితరులు పాల్గొన్నారు.