ప్రతి ఒక్క జర్నలిస్టు వ్యాక్సినేషన్ తప్పకుండా వేయించుకోవాలి : గంజికుంట్ల వెంకన్న

Published: Monday May 31, 2021
పాలేరు, మే 29, ప్రజాపాలన ప్రతినిధి : జర్నలిస్టులు అందరు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ స్నేహ టీవీ. ప్రజాపాలన జాతీయ దినపత్రిక సీనియర్ రిపోర్టర్ గంజికుంట్ల వెంకన్న, అన్నారు. శనివారం నేలకొండల్లి ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొన్నారు. ఈ సందర్భంగా కరోనా నిబంధనలలో పాటిస్తూ ఆయా శాఖల అధికారులతో పాటు జర్నలిస్ట్ పాత్ర ఎంతో కీలక మైనదని, కాబట్టి ప్రతి ఒక్కరు వీధి నిర్వహణలో భాగంగా. ప్రతి జర్నలిస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడంతో కొంత మేరకు సురక్షితంగా ఉండే అవకాశం ఉందన్నారు. వ్యాక్సిన్ మన ప్రాణాలు కాపాడమే కాకుండా మన కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఉందన్నారు. అందుకోరాకు ప్రతి జర్నలిస్ట్ సోదరులు వ్యాక్సిన్ తీసుకోగలేరని కోరారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో సహచర జర్నలిస్ట్ లు వి6 రిపోర్టర్ కర్ణ, ఈనాడు రిపోర్టర్ రవితేజా, సూర్య రిపోర్టర్ వడ్లమూడి వెంకటేశ్వర్లు, ప్రభంజనపదం రిపోర్టర్ తోళ్ళ.బుచ్చలు, బచ్చలకూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.