ఎంపీ అరవింద్ పై జరిగిన దాడిపై బీజేపీ నిరసన...

Published: Friday January 28, 2022

సారంగాపూర్, జనవరి 27 (ప్రజాపాలన ప్రతినిధి): నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై మరియు కాన్వాయ్ బీజేపీ కార్యకర్తలపై ఆర్మూర్ లో ఇటీవల జరిగిన దాడిని నిరసిస్తూ సారంగాపూర్ లో బీజేపీ కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. టిఆర్ఎస్ నేతలు కొందరు రైతుల ముసుగులో ఎంపీ అరవింద్ పై దాడి చేయడం పిరికిపంద చర్య అని సారంగాపూర్ మండల బీజేపీ అధ్యక్షుడు ఎండబెట్ల వరుణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో చెరుకు గంగారెడ్డి ధీటి వెంకటేష్ మోదిగం మల్లేష్ హరీష్ చారి హరీష్ ఉదయ్ జీవన్ రంజిత్ వంశీ రాజు మారం సతీష్ తదితరులు  పాల్గొన్నారు.