అంగన్వాడీ కేంద్రాలలో పోషణపక్వాడ్

Published: Tuesday April 05, 2022

రాయికల్, ఏప్రిల్ 04 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలం లోని వడ్డెర కాలనీ (శివాజీ నగర్)మరియు బోర్న పెల్లి గ్రామాలలో సోమవారం అంగన్వాడీ కేంద్రాలలో పోషణ పక్వాడ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర కాలనీ సర్పంచి మన్నెగూడ వెంకమ్మ నరసయ్య పాల్గొని గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు, పిల్లలకు అన్నప్రాసన అంగన్వాడి టీచర్ సుజాత తో కలిసి జరిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట గ్రామ ఎంపీటీసీ మందుల శ్రీనివాస్ వడ్డెర కాలనీ గ్రామ కార్యదర్శి దివ్య జ్యోతి, ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు గంగాధర్, గ్రామ పెద్దలు మాతలు, పిల్లలు, తదితరులు పాల్గొన్నారు. బోర్నపెల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం నందు గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, కిశోర బాలికలకు అంగన్వాడీ టీచర్ శ్రీలత పౌష్టికాహారం, మాతా శిశు రక్షణ, రక్తహీనత పై అవగాహన కల్పించారు. రక్తహీనత ఉన్నవారు సమతుల్య ఆహారం తీసుకోవ లేనని సూచించారు. ఈ  కార్యక్రమంలో గ్రామ సర్పంచి పాదం లత రాజు, ఎంపీటీసీ కవిత శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయుడు నరసయ్య, ఆశ వర్కర్, ఏఎన్ఎం, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.