రెడ్ క్రాస్ సొసైటీ ఆద్వర్యంలో రక్త దాన శిబిరం ...స్నెహా యూత్ సభ్యుల రక్త దానం .

Published: Thursday August 18, 2022

జన్నారం, ఆగస్టు 17, ప్రజాపాలన: రెెడ్ క్రాస్ సొసైటీ ఆద్వర్యంలో మంచిర్యాల జిల్లా ఏరియా ఆసుపత్రిలో రక్త దాన శిబిరంలో స్నెహా యూత్ సభ్యులు రక్త దానం చేయడం జరిగిందని దూమల్ల జై కూమార్ బుధవారం అన్నారు. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా జిల్లా రెడ్ క్రాస్ మరియు వైద్య శాఖ, మంచిర్యాల, బ్లడ్ బ్యాంకు  నిర్వహించిన రక్తదానం శిబిరం లో జన్నారం చెందిన స్నేహ యూత్ సభ్యులు, ఎనగందుల సన్నీ, పుట్టకొప్పులా రాజు, మర్సుకోల సాయి రక్త దానం చేయడం జరిగింది. రక్తం మునుముందు అవసరం వున్న వారు స్నేహ యూత్ సభ్యులు దుమల్ల జై కుమార్, అత్యవసర సమయంలో రక్తo అవసరం ఉన్న వారు మమ్మల్ని సంప్రదిస్తే రక్త దానం చేస్తామని తెలిపారు. రక్తదానం చేసిన సన్నీ, రాజు, సాయిని, రెడ్ క్రాస్ అధ్యక్షులు మధు సుధన్ రెడ్డి, జన్నారం మండల విద్యాధికారి ప్రసాద్ రావు, స్థానిక ఎస్ఐ పి సతీష్, స్నేహ యూత్ అధ్యక్షులు, దుమల్ల రమేష్, సభ్యులు ప్రశాంత్, శివ, ప్రవీణ్, అభినందించారు