షర్మిల పాదయాత్ర బస్సును దగ్ధం చేయటం దుర్మార్గంవైయస్సార్ టిపి మధిర నియోజకవర్గ
Published: Tuesday November 29, 2022
కోఆర్డినేటర్ మద్దెల మధిరనవంబర్ 28 ప్రజా పాలన ప్రతినిధి నియోజవర్గ పరిధిలోప్రజా సమస్యలపై శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకులు వైఎస్ షర్మిల పాదయాత్ర బస్సును దగ్ధం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ మధిర నియోజకవర్గ కోఆర్డినేటర్ మద్దెల ప్రసాద రావు చింతకాని ముదిగొండ బోనకల్లు మధిర ఎర్రుపాలెం మండల అధ్యక్షులు వాకా వీరారెడ్డి సామినేని రవి మౌలానా ఐలూరి ఉమామహేశ్వర్ రెడ్డి వేమిరెడ్డి మల్లారెడ్డి సోమవారం ప్రకటనలో ఖండించారు వైఎస్ షర్మిలకు ప్రజల నుండి అపూర్వస్పందన లభించడంతో ఓర్వలేని దుండగులు షర్మిల బస్సుని దగ్ధం చేశారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పులిబిడ్డ షర్మిల ఇటువంటి ఉడత ఊపులకు భయపడరని వారు తెలిపారు. షర్మిల బస్సును దగ్ధం చేసిన దుండగులను తక్షణమే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు
Share this on your social network: