అన్నం పరబ్రహ్మ స్వరూపం వినాయకుడి గుడిలో అన్నదానం
మధిర ఫిబ్రవరి 23 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు వినాయకుడి గుడి దగ్గర దాతల సహకారంతో అన్న దానం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని, అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అని వినాయకుడి గుడి మాజీ చైర్మన్ కోన జగదీష్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని మెయిన్ రోడ్డులో వేంచేసి ఉన్న వినాయకుడి గుడి వద్ద తుమ్మలపల్లి పుల్లయ్య జ్ఞాపకార్ధం వారి కుమార్తె అల్లుడు పాగి పార్వతి బాలస్వామి దంపతులు ఏర్పాటుచేసిన అన్నదానాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చేందుకు ప్రతి బుధవారం దాతల సహకారంతో అన్నదానాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అన్నదానాలకు ఆర్థిక సహాయం అందజేసిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి బుధవారం అన్నదానం చేసే దాతలు 9848455832 నెంబర్లో సంప్రదించవలసినదిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దాతలు పాగి శశాంక్ అనూష పాల్గొన్నారు.
Share this on your social network: