కాంగ్రెస్ కార్యకర్త గౌస్ పై తగిన చర్యలు తీసుకోవాలి
Published: Friday February 11, 2022
టి ఎన్ టి యు సి నాయకుడు మనీ రామ్ సింగ్ ఆరోపణ
బెల్లంపల్లి ఫిబ్రవరి 10 ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ అనుబంధ టిఎన్టియుసి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎండీ గౌస్ అనే వ్యక్తి దొంగతనంగా ఆఫీస్ లోకి చొరబడి బీరువాలోని ఆఫీస్కు సంబంధించిన డాక్యుమెంట్స్, ఫైల్స్, వాటితో పాటు పది వేల రూపాయల నగదును ఎత్తుకెళ్లాడని రాష్ట్ర ఉపాధ్యక్షుడు మని రామ్సింగ్ గురువారం నాడు స్థానిక వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. టీఎన్టీయూసీ కార్యాలయంలోకి దొంగతనంగా ప్రవేశించి కార్యాలయానికి సంబంధించిన విలువైన సామాగ్రిని నగదు వ్యక్తి వెళ్ళిన గౌస్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
Share this on your social network: