ఆసిఫాబాద్ జిల్లా ఆగస్టు 26 (ప్రజాపాలన, ప్రతినిధి) :

Published: Saturday August 27, 2022

జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ సమీపములో గల మహాలక్ష్మి దేవాలయం లో శుక్రవారం మహిళలు భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలు చేపట్టారు. శ్రావణ మాసం చివరి రోజు సందర్భంగా మహాలక్ష్మి ఆలయ అర్చకుడు శ్రీధర్ ఆధ్వర్యంలో  అమ్మవారికి ప్రత్యేక గా నైవేద్యం సమర్పించి, మహిళలతో కుంకుమ పూజ  కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కుంకుమ పూజ కార్యక్రమం లో మహిళలు మమత, రమా, పాత ఛాయా, గీత, తదితరులు పాల్గొన్నారు.