హరితహారం మొక్కలను సంరక్షిస్తున్నందుకు కొంగర జగ్గయ్య కు సన్మానం

Published: Tuesday October 12, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 11, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ గ్రామంలో హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపుల నాటిన మొక్కలకు నిత్యం పాదులు తీసి, నీరు పెడుతూ కంటికి రెప్పలా   కాపాడుతున్నందుకుగాను ఆదివారం గ్రామస్తులు ఆయనను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మడుపు వెంకటేష్, నర్కుడీ నరసింహ్మ, బుట్టి మహేందర్ ముదిరాజ్, నరాల శ్రీనివాస్, బుట్టి శ్రీకాంత్, నలోల్ల శేఖర్, కొంగరి చంద్రయ్య, ఎండి జహంగీర్, మడుపు శ్రీనివాస్, బోసుపల్లి కవి, బోసుపల్లి కిషోర్, మంత్రి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.