హరితహారం మొక్కలను సంరక్షిస్తున్నందుకు కొంగర జగ్గయ్య కు సన్మానం
Published: Tuesday October 12, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 11, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ గ్రామంలో హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపుల నాటిన మొక్కలకు నిత్యం పాదులు తీసి, నీరు పెడుతూ కంటికి రెప్పలా కాపాడుతున్నందుకుగాను ఆదివారం గ్రామస్తులు ఆయనను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మడుపు వెంకటేష్, నర్కుడీ నరసింహ్మ, బుట్టి మహేందర్ ముదిరాజ్, నరాల శ్రీనివాస్, బుట్టి శ్రీకాంత్, నలోల్ల శేఖర్, కొంగరి చంద్రయ్య, ఎండి జహంగీర్, మడుపు శ్రీనివాస్, బోసుపల్లి కవి, బోసుపల్లి కిషోర్, మంత్రి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: