పట్టణ సమగ్ర అభివృద్దే లక్ష్యం - ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Published: Monday May 10, 2021
జగిత్యాల, మే 09, (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజాయ్ కుమార్ పట్టణంలోని మూడు డ్రైన్ల నిర్మాణానికి పట్టణంలోని 15 వ వార్డులో సీసీ డ్రైన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలో 50 ఏండ్ల క్రితం నాటి పైపులైన్లు ఉన్నాయని కొన్నిచోట్ల పగలడంతో మిషన్ భగీరథ ద్వారా చేపడుతున్నామని అన్నారు. పట్టణంలో ప్రధానంగా 2 స్మశాన వాటికల నిర్మాణం కొనసాగుతుందని మోతే చింతకుంటవాడలో 80 శాతం పనులు పూర్తయ్యాయని అన్నారు. శంకులపల్లెలో ఎస్సి బిసిల కోసం నిర్మిస్తున్న స్మశానవాటిక పనులు ప్రారంభం అయ్యాయని తెలిపారు. కరోనా సోకినట్టు లక్షణాలు కనిపిస్తే తక్షణమే పరీక్షలు చేసుకోవాలని కోరారు. అప్రమత్తత స్వీయ నియంత్రణ పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ తోట మల్లికార్జున్ కౌన్సిలర్లు కూతురు రాజేష్ కూతురు పద్మ శేఖర్ కూసరి అనిల్ వారణాసి మల్లవ్వ తిరుమలయ్య నాయకులు నరేష్ రాజు అభి మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.