కాంగ్రెస్ పార్టీ గద్దె ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి: బెల్లం శ్రీను.

Published: Monday March 14, 2022
పాలేరు మార్చి 13  ప్రజాపాలన ప్రతినిధి తిరుమలాయపాలెం: కాంగ్రెస్ పార్టీ గద్దను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జడ్పిటిసి సభ్యులు బెల్లం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మండల పరిధిలోని సోలిపురం గ్రామంలో గతంలో నిర్మించిన కాంగ్రెస్ పార్టీ గద్దెను శనివారం రాత్రి గుర్తు  తెలియని వ్యక్తులు ధ్వంసం చెయ్యగా, సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించిన ఆయన మాట్లాడుతూ ఇలాంటి దురంకారచర్యలు. మానుకోవాలని ఈ అఘాయిత్యానికి పాల్పడిన వారిపై  కఠిన చర్యలు. తీసుకోవాలని ఆయాన డిమాండ్ చేశారు.