కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చాలి
Published: Thursday May 27, 2021
బీసీ యువజన సంఘం జిల్లా కార్య నిర్వాహక అధ్యక్షుడు జేక సంజీవ్
మంచిర్యాల జిల్లా, మే26, ప్రజాపాలన ప్రతినిధి : కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చాలని బీసీ యువజన సంఘం జిల్లా కార్య నిర్వాహక అధ్యక్షుడు జేక సంజీవ్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. కరోనా రెండోదశలో తీవ్రంగా విజృంభిస్తున్నందున పేద మధ్య తరగతి ప్రజలు మెరుగైన వైద్యం కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం స్పందించి కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని కోరారు. రాష్ట్ర వైద్యరంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురిఅయ్యిందని, గాంధీ, ఏంజిఎం, ఆసుపత్రులను సందర్శించినంత మాత్రాన సమస్యకు పరిష్కారం దొరకదన్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
Share this on your social network: