మధిర మండలంలో విస్తృతంగా పర్యటించిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు.

Published: Monday March 14, 2022
మధిర మార్చి 13 ప్రజాపాలన ప్రతినిధి మధిర మండలంలో ఆదివారం నాడుపలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు.జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు  ఆదివారం నాడు మధిర మండలంలో విస్తృతంగా పర్యటించారు అందులో భాగంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు ముందుగా మండలంలోని మటూర్ గ్రామంలో కీ.శే.డా.కృష్ణమాచార్యుల సంస్మరణార్ధం ఆయు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి ఆయన ప్రారంభించారు అలానే అదే గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం మాటూర్ పేట గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు ను ప్రారంభించారు అలానే మాటూర్ పేట యస్.సి కాలనీ నందు సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు, ఇటీవల నూతనంగా వివాహం జరిగిన బోల్లేద్దు శ్రీనివాస్ ల నూతన దంపతులను ఆశీర్వదించారు అక్కడ నుండి మర్లపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన రెండు సీసీ రోడ్లను స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి ప్రారంభించారు సర్పంచ్ లీలావతి మండల టిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ టిఆర్ఎఎస్ నాయకులు రాము కోటేశ్వరరావు చావా వేణు సొసైటీ అధ్యక్షులు ప్రసాద్ మార్కెట్ యార్డ్్ చైర్మన నాగేశ్వరరావుఎర్ర నాగేశ్వరావు టిఆర్ఎస్్ నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు