పోషకాహార వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలి ** జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి **

Published: Wednesday March 01, 2023
ఆసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 28 (ప్రజాపాలన,ప్రతినిది) : జిల్లాలో పోషకాహార లోపం, రక్తహీనత సమస్యలను నివారించేందుకు పోషకాహార వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమాఖ్య పరిధిలో నిర్వహిస్తున్న అంజలి మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ ను పరిశీలించారు. గ్రూపు సభ్యులతో మిషనరీ ఉపయోగించు విధానం, జోవర్, రాగి లడ్డు తయారీ విధానాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు చిరుధాన్యాల వినియోగం వల్ల కలిగే లాభాలను తెలియజేసి ఉపయోగించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో డి.పి.ఎం.లు రామకృష్ణ, యాదగిరి, అన్నాజీ, ఏ.పి.ఎం. శ్రీనివాస్, సభ్యులు కృష్ణవేణి, సంగీత తదితరులు పాల్గొన్నారు.