మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన జడ్పీ చైర్మన్

Published: Monday July 04, 2022
బోనకల్, జులై 3 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కిలారు తిరుపతయ్య అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించారు. వారి పార్థివదేహానికి జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదే గ్రామంలో కిలారు అనంతయ్య మరణించడంతో వారి పార్థివ దేహానికి పూలమాలతో నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.అనంతరం గోవిందాపురం (ఎల్) గ్రామంలో కోట కటయ్య సతీమణి రమణమ్మ ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు.
 ఈ కార్యక్రమంలో బోనకల్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జున రావు, రావినూతల సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్, లక్ష్మీపురం మాజీ ఎంపీటీసీ కిలారి వెంకటేశ్వరరావు, టిఆర్ఎస్ నాయకులు వేమూరి ప్రసాద్, చింతకాని టిఆర్ఎస్ మండల అధ్యక్షులు పుల్లయ్య, మండలంలో వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.