జనప్రియ మహానగర్ యువకులు భాజపా లో చేరిక

Published: Tuesday February 09, 2021

బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బిజెపి కార్పొరేషన్ పెండ్యాల నర్సింహ్మ  ఆధ్వర్యంలో సోమవారం నాడు జనప్రియ మహానగరంలో ఉన్నటువంటి యువకులు బి జె పి పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి  రంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి ఇతర ఇతర పార్టీల నుంచి వచ్చిన యువకులకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. బిజెపి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై చేరడం జరిగింది. అన్నారు. బిజెపి పార్టీలో చేరిన యువకులు మాట్లాడుతూ..... ఏ పార్టీ వాళ్ళు అయినా చెప్పేదొకటి, చేసేదొకటి, కానీ పేద ప్రజలను ఆదుకోవడంలో బిజెపి పార్టీ నీ నమ్మి ఈ పార్టీలో  ఉన్న నియమ నిబంధనలు నచ్చి చేరినా మన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు పెండ్యాల నరసింహ్మ, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్  మహిళా మోర్చా అధ్యక్షురాలు సుజాత గౌడ్, సీనియర్ నాయకులు కార్పొరేటర్ కీసర గోవర్ధన్ రెడ్డి, పార్టీలో చేరిన యువకులు ఏ. అనిల్ కుమార్ . పి సత్యనారాయణ, కె. శ్యామ్ కుమార్, ఏ .విశాల్ కుమార్, ఆర్. నితిన్ కుమార్, జే. సరిత, జి. రమాదేవి, పీ. గీత, ఇతరులు పదిహేను మంది, కార్పొరేటర్లు పసునూరి బిక్షపతి చారి, భీమ్ రాజ్, అమర్నాథ్ రెడ్డి, పరమేష్, శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.