బోనకల్ టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నందు జండా వందనం కార్యక్రమం

Published: Thursday January 27, 2022

బోనకల్, జనవరి 26 ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ ఆఫీసు నందు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా వందన కార్యక్రమం మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జున రావు ఆధ్వర్యంలో జరిగినది. ఈ సందర్భంగా టిఆర్ఎస్ మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జున్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల కమిటీ సభ్యులు, అనుబంధ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు మరియు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.