ఉప్పల్లో శ్రేష్ఠ కంటి జనరల్ హాస్పిటల్ ప్రారంభించిన కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి
Published: Friday June 24, 2022
మేడిపల్లి, జూన్ 23 (ప్రజాపాలన ప్రతినిధి)
ఉప్పల్ బస్టాండ్ నుండి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లే ప్రధాన రహదారి గాంధీనగర్లో డాక్టర్ యస్. శ్రీ కుమార్, డాక్టర్ యస్ రజిత నూతనంగా ఏర్పాటు చేసిన శ్రేష్ఠ కంటి మరియు జనరల్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్ మందముళ్ళ రజితపరమేశ్వర్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు.
ఆధునిక టెక్నాలజీతో ఆస్పత్రిని అందుబాటులోకి తెచ్చినట్టుగా డా. యస్.శ్రీ కుమార్, డా యస్ రజిత ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్వర్ణ కుమార్, డివిజన్ అధ్యక్షులు బాకరం లక్ష్మణ్, సల్ల ప్రభాకర్ రెడ్డి, లింగంపల్లి రామకృష్ణ, బ్యాండ్ మహేష్, ఢిల్లీ చంద్రశేఖర్ రెడ్డి, సతీష్ కుమార్, జిత్తురెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: