తెలంగాణ అమరవీరులను అవమానించిన నరేంద్రమోడి వెంటనే క్షమాపణ చెప్పాలి

Published: Friday February 11, 2022
కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘం ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు జి.మోహన్..
పాలేరు పిబ్రవరి 10 ప్రజాపాలన ప్రతినిధి : పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కించపరిచే విధంగా మాట్లాడడాని ఎన్ యస్ యు ఐ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు జి మోహన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ  తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారని, కాని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటులో ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ఏర్పాటును కించపరిచే విధంగా వున్నాయని, నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను, అమరుల త్యాగాలను,  తెలంగాణ ఉద్యమాన్ని  కించపరుస్తూ పార్లమెంటులో మోడి మాట్లాడడం దురదృష్టకరమని వాళ్లు అన్నారు ప్రధానమంత్రి మోడి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు లేనిపక్షంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ ఒక్క బీజేపీ నాయకుడిని తెలంగాణ రాష్ట్రంలో తిరగనివ్వరు అని హెచ్చరించారు తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వెంబడే నరేంద్ర మోడీతో క్షమాపణ చెప్పించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ కార్యక్రమం లో యూత్ కాంగ్రెస్ నాయకుడు పి.రాజేష్ నవీన్ చందు మరియు తదిదరులు పాల్గొన్నారు