శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు శ్రావణమాస ఉత్సవాలు మధిర ఆగస్టు 26 ప్రజాపాలన ప్రతిని
శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయము నందు శ్రావణ మాస ఐదవ శుక్రవారం సందర్భంగా అభిషేకం, కుంకుమార్చన పూజ అనంతరం దర్శనమిచ్చిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు .శ్రావణ మాస ఐదవ శుక్రవారం కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ అధ్యక్షుడు కపిలవాయి జగన్మోహన్రావు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినారు.పూజ చేయించుకునే భక్తులు శ్రీమాన్ శేషాచార్యులు e ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమం చేయించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారుసాయంత్రం పూట పూలలంకరణతో దర్శనమిచ్చిన అమ్మవారు అమ్మవారికి పూలతో అలంకరణ దేవి అవతారంలో అలంకరణతో దర్శనమిచ్చిన కన్యకా పరమేశ్వరి అమ్మవారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మకు కృపకు పాత్రులు అయ్యారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ భక్తులు పాల్గొన్నారు
Share this on your social network: