సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు అండ
Published: Monday September 13, 2021
బాలాపూర్, సెప్టెంబర్12, ప్రజాపాలన ప్రతినిధి : నిరుపేదలకు ఎల్లవేళలా ఆదుకుంటున్న టిఆర్ఎస్ ప్రభుత్వమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 22వ డివిజన్ కార్పొరేటర్ లిక్కి మమత క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో శివ నారాయణపురం కాలనీలో నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును రాష్ట్ర విద్యా శాఖ మంత్రి చేతుల మీదగా అందజేశారు. సీఎం సహాయనిధి పొందిన బాధితులు కొండమీది ప్రభాకర్ గుండె ఆపరేషన్ కొరకు 60 వేలు రూపాయలు, అనురాధ 42000 రూపాయలు చెక్కులు అందజేశారు. ఆ నిరుపేదలు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏం.రాకేష్, ఫణి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: