ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు తనిఖీ

Published: Friday January 20, 2023
 * మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్
వికారాబాద్ బ్యూరో 19 జనవరి ప్రజాపాలన :  సమీకృత మార్కెట్ ను నిర్మించడమే లక్ష్యంగా నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. గురువారం రంగారెడ్డి డివిజన్ పబ్లిక్ హెల్త్ అధికారులతో కలిసి వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ సమీకృత మార్కెట్ నిర్మాణం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలని సూచించారు. అనంతరం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఆలంపల్లిలో ఒక ఎకరం భూమిలో ఒక కోటి రూపాయలతో నిర్మిస్తున్న వైకుంఠధామం పనులను పరిశీలించామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, టియుఎఫ్ఐడిసిఎస్ఈ రమణ మూర్తి, రంగారెడ్డి డివిజన్ పబ్లిక్ హెల్త్ ఈఈ ప్రభాకర్ రెడ్డి, రంగారెడ్డి డివిజన్ పబ్లిక్ హెల్త్ డిఈఈ సాజిద్, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, డిఈ రామ్ కిషన్, ఏఈ రాయుడు తదితరులు పాల్గొన్నారు.