రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఎమ్మెల్యే గారిని సాంప్రదాయంగా కలిసి శుభాకాంక్ష

Published: Saturday January 29, 2022
ఇబ్రహీంపట్నం జనవరి 28 ప్రజాపాలన ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలో పోల్కంపల్లి గ్రామానికి చెందినవారిమి ఈరోజు క్యాంపు కార్యాలయానికి చేరుకుని టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు దానయ్య  గౌడ్ సర్పంచ్ చెరుకూరి అండాలు గిరి మాట్లాడుతూ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే కి రంగారెడ్డి జిల్లా అధ్యక్ష పదవి దక్కడం ఆయన చేసుకున్న సుకృతం అని అన్నారు ఈరోజు వరకు నియోజక ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పైన నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి గా ఉన్నారు కాబట్టి గుర్తించి రంగారెడ్డి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం ఆనందం వ్యక్తం చేస్తున్నాం ఈరోజు నియోజవర్గం ఒకటే కాకుండా రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా విస్తరించి ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ టిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మండల పార్టీ అధ్యక్షుడు చిలక బుగ్గ రాములు, ఆదర్శ రైతు గూడం యాదయ్య, టిఆర్ఎస్ పార్టీ గ్రామ కార్యదర్శి పెద్ద మొత్తాన్ని ధనరాజ్, కంబాలపల్లి కృష్ణ, కంబాలపల్లి బాలు, ఏదుల్ల కుమార్ పెద్దమ్మతల్లి భగత్, నందికొండ భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.