ఇండియా క్రిస్టియన్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో

Published: Thursday May 19, 2022

వికలాంగులకు వీల్ చైర్స్ పంపిణీ

బోనకల్ ,మే 18 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని గోవిందాపురం (ఎల్) గార్లపాడు లో ఇద్దరు దివ్యాంగులకు ఇండియా క్రిస్టియన్స్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఉచిత వీల్ చైర్స్ పంపిణీ చేశారు,అర్హులైన ప్రతి ఒక్కరికి వీల్ చైర్స్ అందజేస్తామని నిర్వాహకులు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఐ.సి.యం నాయకులు రెబ్బవరపు జెస్సీ పాల్, ఖమ్మం జిల్లా డి.ఎల్ శామ్యూల్ రాజు,మొండితోక అశోక్,మోహన్ కృష్ణ బోనకల్ మోహన్ జ్యోతి న్యూస్ ప్రతినిధి మాగి ముఖేష్ తదితరులు పాల్గొన్నారు.