వాగులో పడి వ్యక్తి మృతి

Published: Tuesday November 16, 2021
వికారాబాద్ బ్యూరో 15 నవంబర్ ప్రజాపాలన : ప్రమాదవశాత్తు వ్యక్తి వాగులో పడి మృతి చెందిన సంఘటన నవాబ్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల్ ముబారక్ పూర్ గ్రామానికి చెందిన వెంకన్నోల్ల గోపాల్ రెడ్డి (60) ఆదివారం పొలం పనులు పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వస్తుండగా వాగులో జారి పడి పోయి మృతి చెందడం జరిగింది. రాత్రి ఎంత సేపటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఊర్లో వెతికిన జాడ లభ్యం కాకపోవడంతో నవాబ్ పేట్ మండల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం వాగులో మృతదేహం కనిపించడంతో గ్రామస్థుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీసి చూడగా మృత దేహం గోపాల్ రెడ్డిదేనని నిర్ధారణ చేసిన కుటుంబ సభ్యులు. మృతుడి భార్య సావిత్రమ్మ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేషం తెలిపారు.