వడగళ్ల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి : జీవన్ రెడ్డి

Published: Thursday May 13, 2021
బీరుపూర్, మే 12 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండలం తుంగూర్ గ్రామంలో సోమవారం వడగళ్ల వర్షం ఈదురు గాలులతో తుంగూర్ గ్రామానికి చెందిన ఆడెపు తిరుపతికి చెందిన కోళ్ల పౌల్ట్రీ ఫౌమ్ ఆదర్శ రైతు మిట్టపల్లి రాములు మ్యాడ జనార్దన్ కు చేందిన మామిడి తోట పండ్లు చెట్లు నేలపై రాలడంతో తోటలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరిశీలించారు. తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతుల గురించి ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెల్లి బాధిత కుటుంబాలను ఆదుకుంటానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ వెంట ఉమ్మడి సారంగాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రచారకమిటి అధ్యక్షుడు గుడిసె జితేందర్ యాదవ్ సర్పంచ్ గుడిసె శ్రీమతి ఎంపీటీసీ ఆడెపు మల్లీశ్వరి బీరుపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేరుపూరి సుభాష్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.