దుగోడు మిషన్ లో పడి వ్యక్తి చేతికి తీవ్ర గాయాలు
Published: Monday February 20, 2023
బోనకల్ ,ఫిబ్రవరి 18 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో కార్పెంటర్ వర్కు చేస్తున్న వడ్రంగి వైరా పట్టణానికి చెందిన పిడతల వెంకటేశ్వర్లు(49) ఫర్నిచర్ వర్క్ చేస్తుండగా ప్రమాదవశాత్తు చెయ్యి దూగోడు మిషన్ లో జారటం వల్ల చేతికి బలమైన గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 కి సమాచారం అందించగా హుటాహుటిన స్పందించిన 108 సిబ్బంది కోట భానుసహన్ , కలసాని వెంకట్రావు బాధితునికి ప్రధమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కొరకు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Share this on your social network: