*పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్ సరికాదు - పిసిసి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల రఘువీర్ ర

Published: Tuesday January 03, 2023
వికారాబాద్ బ్యూరో 02 జనవరి ప్రజాపాలన : సర్పంచుల సమస్యలను పరిష్కరించాలని
పీసీసీ చీఫ్ మల్కాజ్గిరి ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేయడం సరికాదని పిసిసి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల రఘువీర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీపీసీసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమానికి పీసీసీ చీఫ్ మల్కాజ్గిరి ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డిని వెళ్ళకుండా అడ్డుకోవడం అప్రజాస్వామిక చర్య అని విమర్శించారు. సర్పంచులకు నిధులు మంజూరు కాకపోవడంతో గ్రామాల్లో సమస్యలు నిండిపోయాయని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి పోలీసులతో అడ్డుకట్ట వేయాలనుకోవడం సమంజసం కాదని అన్నారు. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాను అని తెలిపారు.