హెచ్.పీ గ్యాస్ అధినేత ఆధ్వర్యంలో అన్న వితరణ

Published: Friday March 11, 2022
మధిర మార్చి 10 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు కీర్తిశేషులు శ్రీ దోసపాటి మణికంఠ జ్ఞాపకార్థం సందర్భంగా వారి మేనత్త హెచ్.పీ గ్యాస్ ప్రొప్రైటర్ శ్రీమతి దోసపాటి కళ్యాణి డాక్టర్ వసంతమ్మగారి సేవాసదనము మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో విద్యార్థులకు మరియు సిబ్బంది అన్న వితరణ చేశారుఈ సందర్భంగా శ్రీమతి దోసపాటి కళ్యాణి ఈ సందర్భంగా కళ్యాణి మాట్లాడుతూ మానసిక దివ్యాంగుల పట్ల సానుభూతి కాదు వారిని సమాజంలో స్వశక్తితో మానసికంగా దృఢ సంకల్పంతో జీవించుటకు ప్రతి ఒక్కరు వారికి సహకరించాలి ఈ కార్యక్రమంలో వారి సిబ్బంది వాసు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సేవా సదనము డైరెక్టర్ డాక్టర్ కె షీలారాము  మాట్లాడుతూ మానసిక దివ్యాంగులకు అన్న వితరణ చేసిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు