దాతల సహకారంతోవస్త్ర నిదికి వస్త్రాల వితరణ
Published: Monday July 04, 2022
మధుర జులై 3 ప్రజాపాలన ప్రతినిధి మధిర పట్టణంలో స్థానిక అజాద్ రోడ్డులో ప్రముఖ సామాజిక సేవకులు లంకా కొండయ్య నిర్వహిస్తున్న మహాత్మాగాంధీ ఓల్డ్ క్లాత్ బ్యాంక్ కు మధిర మరియు మధిర మండలంలో ఉన్న ప్రముఖులు కమ్మ జన సేవా సంఘo సభ్యులు శ్రీ గడ్డం రమేష్ విశ్రాంత ఉపాధ్యాయు లు (సిరిపురం నివాసి ) మండల తేరాసా కోశాధికారి శ్రీ నల్లమల శ్రీనివాసరావు అదే విధముగా ప్రముఖ వ్యాపారవేత్త ఆర్యవైశ్య సభ్యులు, కవి శ్రీ పుల్లఖండం చంద్రశేఖర్ సంయుక్తంగా వారి ఇళ్లలో అదనపు దుస్తులు లంకా కొండయ్యకు అందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా అన్నదానం, అవయవ దానంతో పాటు వస్త్రధానం కూడా ఇలా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి కడుపేదలకు సహాయం చేయాలనీ వారు సూచించారు.
అంతేకాకుండా లంకా కొండయ్య హెచ్ఐవి ఎయిడ్స్ బాధిత కుటుంబాలకు అనేక సంవత్సరాలుగా వారికి సేవలు అందిస్తూ ఎక్కడ పడితే అక్కడ జనసమూహంలో హెచ్ఐవి/ఎయిడ్స్ పై తనదైన శైలిలో అవగాహన పరచడం అభినందనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో లంకా సేవ ఫౌండేషన్ వాలంటీర్లు పాల్గొన్నారు.
Share this on your social network: