బిజెపి నాయకులను అరెస్ట్ చేయడం ఆప్రజాస్వామికం...

Published: Thursday June 10, 2021
జగిత్యాల, జూన్ 09, (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల జిల్లాలోని సీఎం కేసీఆర్ మెటుపల్లి పర్యటనలో భాగంగా అక్రమంగా బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం నిరంకుశ చర్య అని రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన నడుస్తుందా లేక నిజాంపాలన నడుస్తుందా బీజేపీ నాయకలను కార్యకర్తలను అరెస్ట్ చేయడం ఆప్రజాస్వామికం పిరికిపంద చర్య అని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి భూమి రమణ కుమార్ మండిపడ్డారు. తెరాస ప్రభుత్వం బీజేపీ కార్యకర్తలకు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని కేసీఆర్ నియంత పాలనకు పూర్తిగా అద్దం పట్టేవిదంగా ఉందని భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నటుగా ఉందన్నారు. తెరాస ప్రభుత్వం అరెస్టులతో గొంతు నొక్కలేరని బిజెపి నాయకులకు భయపడి ముందస్తు అరెస్టులు చేస్తున్నారని ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో మీకు తగిన గుణపాఠం తప్పదని భూమి రమణ కుమార్ హెచ్చరించారు.