రెండు రోజుల క్రితం మిస్సైన నవ వధువు నవ్య రెడ్డి(22) మృతి

Published: Saturday February 06, 2021

భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పెనుబల్లి మండలం కొత్తలంక పల్లి గుట్టమీద నవ్య రెడ్డి మృతదేహం లభ్యం.*ఆ రోజు అసలేం జరిగింది.._* భార్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంక పల్లి గ్రామ శివార్లలోని కుక్కల గుట్ట వద్ద చోటు చేసుకుంది.
ఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెం కు చెందిన ఎర్రమల నవ్య రెడ్డి అనే 22 ఏళ్ల వివాహితను ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంక పల్లి గ్రామ శివార్లలోని కుక్కల గుట్ట వద్ద అమే భర్త నాగ శేషు రెడ్డి చున్నీతో ఉరివేసి హత్య చేశాడు..గత రెండు రోజుల క్రితం ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్ లో నవ్య రెడ్డి భర్త నాగ శేషు రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.భర్త ఇచ్చిన పిర్యాదు ప్రకారం నవ్య రెడ్డి అదృశ్యం అయినట్లు కేసు నమోదు చేసుకున్న పోలీస్ లు దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలో భర్త నాగ శేషు రెడ్డి కదలికల పై అనుమానం వచ్చిన పోలీస్ లు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు.
పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల గ్రామంలోని సీసీ కెమెరా లో నమోదు అయిన దృశ్యాల ఆధారంగా మృతురాలు నవ్య రెడ్డి భర్త నాగ శేషు రెడ్డి ను అదుపులోకి తీసుకుని విచారించగా ఆశలు విషయం వెలుగు చూసింది..బుదవారం రాత్రి సమయం లో నవ్య రెడ్డి ని బైక్ పై తీసుకు వచ్చి కుక్కల గుట్ట వద్ద మత్తు టాబ్లెట్ లు ఇచ్చి అనంతరం చున్ని తో ఉరి వేసి హత్య వేశాడు.. ఆ తరువాత హత్య ను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతురాలి సెల్ ఫోన్ నుండి ఆమె తండ్రికి మెసేజ్ చేసాడు నిందితుడు శేషు రెడ్డి..ఇంజినీరింగ్ లో బ్యాక్ లాక్ క్లాస్ లు ఉన్నాయని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మృతురాలి సెల్ పోన్ నుండి మెసేజ్ లు పంపించాడు నిందితుడు.
ఆ తరువాత ఏర్రు పాలెం పోలీస్ స్టేషన్ లో తన భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు.
నిందితుడు నాగ శేషు రెడ్డి  పునే లో ఉద్యోగం చేస్తుంటాడు.మృతురాలి కి స్వయానా మేన మామ కొడుకు నాగ శేషు రెడ్డి.రెండు నెలల క్రితమే వీరికి వివాహం జరిగింది.. మృతురాలు సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలోని సాయి స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది..