శ్రీ దుబ్బరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న - జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ దంపతులు

Published: Saturday March 13, 2021
సారంగాపూర్, మార్చి 12 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండలం పెంబట్ల కోనపూర్ శ్రీ దుబ్బరాజేశ్వర స్వామిని జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ దంపతులు కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. జడ్పీ చైర్ పర్సన్ కు ఆలయ అర్చకులు అధికారులు నాయకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి చిత్ర పటాన్ని బహుకరించారు. అనంతరం పొలాస పౌలస్తీశ్వర శివాలయాన్ని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోల జమునశ్రీనివాస్ జడ్పీటీసీ మేడిపల్లి మనోహర్ రెడ్డి ఆలయ ట్రస్ట్ చైర్మన్ పోరండ్ల శంకరరయ్య ఈఓ కాంతారెడ్డి సర్పంచులు బొడ్డుపల్లి రాజన్న ఆకుల జమున పల్లికొండ రమేష్ ధర్మకర్తలు సిబ్బంది పాల్గొన్నారు.