ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 17ప్రజాపాలన ప్రతినిధి *సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీవో వెంకట చారి

Published: Friday November 18, 2022

అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలో సర్వేనెంబర్ 283 ప్రభుత్వ భూమిలో గ్రామస్తులందరూ కలిసి గత నెల ఏడో తారీఖు గుడిసెలు వేసుకొని 37 రోజులపాటు గుడిసెల జీవనం కొనసాగించారు అట్టి గుడిసెలను ఈనెల 13వ తారీఖున రెవెన్యూ అధికారులు పోలీసు బలగాలతో గుడిసెలు తీసివేసి మహిళలు అని కూడా చూడకుండా నాటి ఛార్జ్ చేసి అరెస్టులు చేయడం జరిగింది. దీనికి నిరసనగా ఈరోజు ఇబ్రహీంపట్నం ఆర్డిఓ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేసి, ఆర్డీవో  కి , మేము రాండంఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యాదయ్య , మండల కార్యదర్శి ఏర్పుల నరసింహులు మాట్లాడుతూ గతంలో ఇందిరమ్మ ఇండ్ల కింద పట్టా సర్టిఫికెట్ ఇచ్చిన వారందరికీ, మరియు అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇవ్వకపోతే ఎన్ని కేసులు పెట్టినా గుడిసెలు వేస్తూనే ఉంటామని అన్నారు. ఆర్డీవో గారు మాట్లాడుతూ, డబల్ బెడ్ రూమ్ కాకుండా ప్రభుత్వం కూడా గతంలో పట్టాలు ఉన్నవాళ్ళకి ఇండ్ల స్థలాలు ఇచ్చే ఆలోచన ఉందని మీరు ఏమి అధైర్య పడకూడదని అని అన్నారు. ఈ కార్యక్రమంలో, సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు గుండె శివ, చిర్ర శివకుమార్, కిరణ్ ప్రణయ్, అనిత, జీవిత, రమాదేవి, మైసమ్మ, లలిత, భాగ్యలక్ష్మి, సంధ్య, పోచమ్మ, బాలమ్మ 40 రోజుల గుర్తులు వేసుకొని నష్టపోయిన మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.