తెలంగాణకు ముఖ్యమంత్రిని నేనే.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్..

Published: Wednesday February 22, 2023
 ఖమ్మం, ఫిబ్రవరి 21 (ప్రజా పాలన న్యూస్):
రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా తనను ప్రజలు గెలిపిస్తారని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. సోమవారం రాత్రి ఖమ్మంలోని కృష్ణ ఫంక్షన్ హాల్ లో ఆ పార్టీ జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేఏ పాల్  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అనేక రకాలుగా అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటే నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీ రానిస్తుందని, దీంతో కేసీఆర్ అనేక అపోహాలు సృష్టిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ కమిటీలను వేయనున్నట్లు తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనదన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇల్లు, దళితులకు మూడెకరాలు భూమి, నిరుద్యోగ భృతి అనేక హామీలు ఇచ్చి తుంగలో తొక్కారన్నారు. ఈసారి ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అపార్టీ నాయకులు నారపోగు ప్రసాద్,  నర్సింహారావు, ఉపేంద్ర, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.*