ఎస్సీ కార్పొరేషన్ దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు
Published: Tuesday August 17, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 16 ప్రజాపాలన ప్రతినిధి : ఎస్సీ కార్పొరేషన్ కింద 2020- 21 సంవత్సరానికి గాను దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సోమవారం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. దరఖాస్తు చేసుకున్న వారికి సోమవారం ఉదయం 11 గంటలకు ఎస్సీ కార్పొరేషన్ అన్ స్కిల్డ్ కింద ఎంపీడీవో హెచ్. మహేష్ బాబు, ఎం పీ ఓ సురేష్ రెడ్డి మరియు బ్యాక్ మేనేజర్లు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది. మొత్తము 126 దరఖాస్తుదారులకు గాను 82 మంది దరఖాస్తుదారులు హాజరైనారు. ఈ యొక్క ఇంటర్వ్యూ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్లు డేవిడ్, సురేష్ మరియు కార్యాలయ సిబ్బంది రామకృష్ణ, సత్యనారాయణ, శివ శంకర్ పాల్గొన్నారు.
Share this on your social network: