ధాన్యా గారానికి కారణం కెసిఆరే.. సర్పంచ్ రాజిరెడ్డి

Published: Wednesday June 16, 2021
పరిగి 15 జూన్ ప్రజా పాలన ప్రతినిధి : తెలంగాణలో అత్యధిక సాగుకు కెసిఆర్ ఆలోచనలే కారణం అని దోమ మండల రైతు కో ఆర్డినేటర్ బోయిని లక్ష్మయ్య సర్పంచుల సంఘం అధ్యక్షులు కె రాజిరెడ్డి అన్నారు.మంగళవారం తెలంగాణ రైతంగానికి ఖరీఫ్ పెట్టుబడి నిమిత్తం రైతు బందు సహాయం ప్రారంభించడం తో దోమ మండల కేంద్రంలోని రైతువేదిక దగ్గర సీఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. ప్రాజెక్టుల నిర్మాణాల వల్ల తెలంగాణాలో కోటి ఎకరాలకు పైగా సాగు చేయడం రైతులు పండించిన ధాన్యంను మద్దతు ధరలకు కొనుగోలు చేసి రైతు పక్షపాతిగా నిలిచాడని పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ రాజగోపాలాచారి డైరెక్టర్ యాదయ్య గౌడ్, ఉప సర్పంచ్ గోపాల్ గౌడ్ లు అన్నారు. ఈ కార్యక్రమంలో దోమ రైతు సంఘం బోయిని బుచ్చయ్య, ఛైర్మెన్ పాల ఉత్పత్తి దారుల ఛైర్మెన్ యాదయ్య, వార్డ్ సభ్యులు లక్ష్మణ్, సాయి, నాయకులు బంగ్లా వెంకటయ్యగౌడ్, నరేందర్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.