టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన కార్పొరేటర్ బండారి మంజుల రవీందర్

Published: Thursday April 28, 2022
మేడిపల్లి, ఏప్రిల్ 27 (ప్రజాపాలన ప్రతినిధి) : టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ కార్పొరేటర్ బండారి మంజుల రవీందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డివిజన్లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కార్పొరేటర్ మంజుల రవీందర్ టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపారు. అనంతరం కార్పొరేటర్ ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాను అందజేశారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు జావీద్ ఖాన్, టీఆర్ఎస్ నాయకులు సుఖ జయేందర్, కర్రె బలరాం, హాజీ, వార్డు సభ్యులు మల్లం వెంకటేష్ గౌడ్, చెరుకు మహేష్ గౌడ్, పాపయ్య, శ్రీనివాస్, వెంకటేష్ గౌడ్, రమణ రెడ్డి, వెంకట్ రెడ్డి, సుధాకర్, సుమిత్ పాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.