బీర్పూర్ మండలంలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం

Published: Friday October 28, 2022
జగిత్యాల, అక్టోబర్, 27 ( ప్రజాపాలన ప్రతినిధి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ రాజకీయాలనే అపహాస్యం చేస్తూ, తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిర పరచాలనే కుట్రతో 400 కోట్లతో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ పార్టీ నాయకులు నిస్సిగ్గుగా బేరసారాలు ఆడటంపై మండిపడుతూ గురువారం ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు బీర్పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో కొల్వాయిలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపినారు. ఈ కార్యక్రమంలో కేడిసిసి జిల్లా డైరెక్టర్ ముప్పాల రాంచందర్ రావు, జిల్లా రైతుబందు సమితి మెంబర్ కొలముల రమణ, కోల శ్రీనివాస్, జిల్లా నాయకులు అయిల్నేని సాగర్ రావు, రవీందర్ రావు, నారాయణ రావు, చంద్రశేఖర్ రావు, పార్టీ మండల అధ్యక్షుడు నారపాక రమేష్, రైతుబందు సమితి మండల అధ్యక్షుడు మెరుగు రాజేశం, ఎక్స్ జడ్పీటీసీ ముక్క శంకర్, మండల ఉపాధ్యక్షులు రామకిస్టు గంగాధర్, ఎస్సి మండల కమిటీ అధ్యక్షుడు ఉయ్యాల కిషన్, సర్పంచులు పర్వతం రమేష్, చిక్రం మారుతి చుంచు నరేందర్, మాజీ సర్పంచ్ రంగు మల్లేశం, నాయకులు దోసరపు బుచ్చన్న, అశోక్, నగేష్, శంకర్, సతీష్ రవీందర్, మోగిలి, యువకులు అగస్టీన్, మహేష్, శాజన్, వెంకటేష్, సత్తన్న మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.